మనలో ఎంత మంది ఇలా ఉంటున్నాము....
హక్కు - బాధ్యత
దాదాపుగా నేటి యువతకు వీటి గురించి తెలియక పోవచ్చు లేదా తెలియవచ్చు! ఐతే దింట్లో స్వార్థం లేదా మనల్ని ప్రభావితం చేసే వ్యక్తులపైన కూడా ఇవి ప్రయోగించపడతాయి. సరే ముందు ఈ "హక్కు - బాధ్యత "అంటే ఏంటో చూద్దాము, హక్కు మనకు కావాల్సిన వాటిని అడిగి సాదించుకోవటం. ఉదాహరణకు:కుటుంబానికి వస్తే, తండ్రి లేదా తాత ఆస్తులు. దేశానికీ వస్తే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా జీవించే హక్కు.ఐతే బాధ్యత అంటే ఏమిటి ఉదాహరణకు : తల్లి లేదా తండ్రి కి కనీస అవసరాలు అలాగే వైద్యం చేయించటం లాంటివి బాధ్యతలు. అలాగే దేశం విషయానికి వస్తే, దేశ పౌరుడిగా దేశ సంరక్షణ ఉదాహరణ కు దేశంలోకి ఎవరైనా చొరబాటు దారులు వస్తే వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వటం. బాధ్యతతో మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు కాదు.ఈ మధ్య కాలంలో దాదాపుగా తల్లి తండ్రులను చూసే వారి సంఖ్య ఘననీయంగా తగ్గింది, వాటికీ ఉదాహరణలే old age homes. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, అందర్నీ తప్పు పట్టలేము.ఐతే నా question వారి ఆస్తి కావాలి అనే హక్కు వాడుకుంటున్నారే కానీ వారిని చూడాలి అనే బాధ్యత ఎందుకు విస్మరిస్తున్నారు. దీనికి వాళ్ళు చెప్పే కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ బాధ్యత ఐతే వారు నెరవేర్చటం లేదు కదా.ఐతే వారు చూడక పోవటానికి వారి భాగస్వామి లేదా మరి ఎవరైనా ప్రభావితం చేయవచ్చు. అప్పుడు తప్పు ఎవరిది అంటారు? సరే కొంతమంది అంటారు అసలు మాకు మా తల్లి తండ్రులు ఆస్తులు ఇవ్వలేదు అని అలా ఐతే వారిని చూసే బాధ్యత లేదు అని తప్పించుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఐతే నేను అనేది వారిని చదివించటం లేదా వారికి కావాల్సిన మోరల్ సపోర్ట్ ఇవ్వటం కూడా ఆస్తులే అంట? మీరు ఏమంటారు. అసలు ఇవి కాదు నువ్వు ఈ లోకంలోకి వచ్చి నీకంటూ ఒక స్థానాన్ని కలిపించారు.అది అనేది లేకపోతే నువ్వు అనేవాడివి ఎక్కడ? నీ భాగస్వామి తరపున వాళ్లే
నిన్ను చిన్నప్పటి నుండి చూసారా? రేపు నీ పిల్లలు అలాగే చూస్తే?
ఇక ముఖ్యమైనది దేశం మీద బాధ్యత ఎంత మందికి ఉంది. ఎంతసేపు దేశం నాకు ఏమి చేసింది అని ఒకసారి ఆలోచించాలి మనము దేశానికీ మనము ఏమి చేసాము లేదా చేస్తున్నాము. చాలా మంది అంటున్నారు అక్రమంగా ఇక్కడకు వచ్చి రోహింగ్యాలు పాకిస్తానీలు ఉంటే దేశం భద్రత దళాలు ఏమి చేస్తున్నారు అని? వారు చేసే పని వారు చేస్తారు మనము చెప్పక్కర్లేదు. నువ్వు ఏమి చేస్తున్నావు అది చెప్పు, కనీసం ప్రభుత్వానికి సమాచారం ఇస్తున్నావా? లేదు కాకపోగా నీకు తెలిసి,తెలియని మాటలు లేదా పోస్టులు తో అక్కసు కక్కటం. ఎంత దారుణం అంటే పెహల్గం దాడి తరువాత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫై వ్యతిరేకంగా మాట్లాడటం అదే హక్కు అనటం. సిందూజలాలు ఆపకూడదు అని కొందరు ఆపాలి అని, ఏంటి ఈ విపరీత ధోరణి.పైగా నీరు పంపాలి అని ధర్నాలు కూడా చేస్తున్నారు.
సరే ఇవి నాకు తెలిసి చిన్న ఉదాహరణలు.
మీ అభిప్రాయాలు కామెంట్ సెషన్లో తెలపండి.

.jpeg)
0 కామెంట్లు