డాక్టర్ "శ్రీ వేణు" బాతులకు గౌరవ డాక్టరేట్ అందజేత
ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల మండలం, కోడిగూడెంకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు డాక్టర్ శ్రీ వేణు బాతుల గారు తన విశేషమైన సేవా కార్యక్రమాలకు గాను గౌరవ డాక్టరేట్తో సత్కరించబడ్డారు. వరల్డ్ కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిషన్ ఆయన సేవలను మెచ్చి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా న్యూ ఢిల్లీలో "డాక్టరేట్ ఇన్ సోషల్ వర్కర్" (హోనరిస్ కాసా) అవార్డునుప్రకటించింది.
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో డాక్టర్ వేణు బత్తుల చేసిన సేవలు అమోఘమైనవి. నిరుపేదలకు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయడమే కాకుండా, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించారు. ఫ్రంట్లైన్ వారియర్స్ను గౌరవించడం, గ్రామాలలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే, ఆక్సిజన్ సిలిండర్లను అవసరమైన వారికి అందించి ఎందరో ప్రాణాలను కాపాడారు.
ఈ అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.డాక్టర్ వేణు బత్తుల మాట్లాడుతూ, ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు.సమాజ సేవలో ఆయన నిబద్ధత, కృషి యువతకు ఆదర్శనీయమని పలువురు కొనియాడారు. ఈ గుర్తింపు ద్వారా సమాజ సేవ పట్ల మరింత మంది ప్రేరణ పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.


0 కామెంట్లు