🌧️ తుఫాన్ బాధితుల పట్ల మానవత్వం చూపిన డాక్టర్ వేణు బాతుల
ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ ప్రభావంతో పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులను శివాజీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రముఖ సామాజిక సేవకుడు డాక్టర్ వేణు బాతుల స్వయంగా సందర్శించారు.
చలికాలం ప్రారంభమై చలికి వణుకుతున్న వృద్ధులను, చిన్నారులను చూసి చలించిపోయిన ఆయన, వెంటనే వారికి దుప్పట్లు, పంపిణీ చేస్తూ తన మానవత్వాన్ని చాటుకున్నారు.
“వారిలో చిరునవ్వు చూడగలగడం నా నిజమైన ఆనందం” అని డాక్టర్ వేణు బాతుల తెలిపారు.
ఆయన మాట్లాడుతూ —
“విపత్తు వచ్చినప్పుడు మనుషులు మాత్రమే కాదు, మానవత్వం కూడా పరీక్షించబడుతుంది. ఈ సమయాల్లో సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని అన్నారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన వస్తువులను పంపిణీ చేయడమే కాకుండా, బాధితులతో ఆత్మీయంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సేవా కార్యక్రమంలో మనుకొండ వెంకటరత్నం, కందికొండ మధు, రేపకుల రమేష్, బంటుమెల్లి అశోక్, మనుకొండ రవి, మనుకొండ ప్రవీణ్, రేపకుల మహేశ్, మనుకొండ భాను, మనుకొండ ఇమ్మానుయేలు, తడి తరులు తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ వేణు బాతుల ఈ సేవా కార్యక్రమం ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది. సమాజంలో మానవతా విలువలను గుర్తుచేసే ఈ కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచింది

.jpeg)

0 కామెంట్లు