గోల్డ్ బాండ్ స్కీమ్ లో చిన్న వెంకన్న బంగారం 4 కేజీల 940 గ్రాములు డిపాజిట్..
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు స్వామివారికి హుండీల ద్వారా వచ్చిన బంగారం మిశ్రమము 4 కేజీల 940 గ్రాములు గోల్డ్ బాండ్ స్కీమ్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , కాళేశ్వరంమార్కెట్ బ్రాంచ్ విజయవాడ డిపాజిట్ చేశారు. చిన్న వెంకన్న దేవస్థాన కార్యనిర్వాహణాధి కారి NVSN మూర్తి, బాబురావు డిప్యూటీ కమిషనర్, వి.వి.పల్లంరాజు, జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ సమక్షంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ వారికి మంగళవారం అప్పగించడం జరిగింది అని తెలిపారు.

0 కామెంట్లు