Sri ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ & 96 ఏళ్ల పోతుల పేరంటాలు గారు
పిఠాపురం నియోజకవర్గం, యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు గారు, ఉప ముఖ్యమంత్రి Sri కొణిదల పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో, ఆయన విజయం సాధించాలని వేగులమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టి, అమ్మవారికి గరగ చేయిస్తానని మొక్కుకున్నారు. తన పింఛను సొమ్ము నుంచి రూ.2,500 చొప్పున పోగు చేసి, రూ.27వేలతో గరగ చేయించి సమర్పించారు. ఆమెకు తనతో కలిసి భోజనం చేయాలని ఉందని తెలిసిన వెంటనే, ఈ రోజు పేరంటాలు గారిని క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి, ఆవిడతో కలిసి భోజనం చేసి, చీరను, లక్ష రూపాయల నగదును అందించిన ఉప ముఖ్యమంత్రి Sri Pawan Kalyan




0 కామెంట్లు