Ticker

6/recent/ticker-posts

Andhra Pradesh Latest News 2024

 ఐ స్ జగన్నాధపురం నరసింహాస్వామిని దర్శించుకున్న పోలవరం MLA చిర్రి బాలరాజు

ద్వారకాతిరుమల రూరల్ 

Breaking News Telugu | Telugu News Today Oneindia Telugu: Telugu News | Online Telugu News | Latest Breaking News: నేటి తాజా వార్తలు Andhrajyothi Telugu News: Latest Telugu News , Latest తెలుగు Samayam Telugu: Latest Telugu News, Breaking News in వార్తలు - BBC News తెలుగు తాజా వార్తలు Telugu Post | Online Telugu News | Latest News in Telugu Latest Telugu News, తెలుగు వార్తలు

ద్వారకాతిరుమల మండలం, I S జగన్నాధపురం గ్రామం 
 శ్రీ శ్రీ శ్రీ కనకవల్లీ సమేత నరసింహా స్వామిగా -ఐ.ఎస్ జగన్నాధం కొండలో కొలువై ఉన్న స్వామి వారికీ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఏలూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి.కార్యదర్శి గడ్డమనుగు రవి. గోపాలపురం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ సువర్ణ రాజు మరియు ఆలయా కమిటీ , కొయ్యలగూడెం మండల అధ్యక్షులు తోట రవి.NDA కూటమి నాయకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరరిగింది.

మతమార్పిడిలు అరికట్టాలి 

ద్వారకాతిరుమల రూరల్ 

Breaking News Telugu | Telugu News Today Oneindia Telugu: Telugu News | Online Telugu News | Latest Breaking News: నేటి తాజా వార్తలు Andhrajyothi Telugu News: Latest Telugu News , Latest తెలుగు Samayam Telugu: Latest Telugu News, Breaking News in వార్తలు - BBC News తెలుగు తాజా వార్తలు Telugu Post | Online Telugu News | Latest News in Telugu Latest Telugu News, తెలుగు వార్తలు

ఈరోజు ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం లో హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి మరియు సమరసత సేవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దళిత కాలనీలో శ్రీరామ భజన ఏర్పాటు చేసి వచ్చిన దళిత వర్గాలు అందరికీ భగవద్గీత లు స్వామివారి తీర్థప్రసాదాలు పసుపు కుంకుమ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన హిందూ దేవాలయాల ధర్మ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దర్శనపు శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యంగా "గోదావరి జిల్లాల్లో విపరీతమైన మతమార్పిడిలు జరుగుతున్నవి వాటిని అరికట్టి తిరిగి దళిత వర్గాలను అందర్నీ హిందూ ధర్మంలోకి తీసుకువచ్చే పనిలో నిమగ్నమైనట్టు తెలియజేశారు ఇలాంటి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో అనేకమైన గ్రామాల్లో త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు" దర్శనపు శ్రీనివాస్ మీడియాకి తెలియజేశారు తిమ్మాపురం గ్రామంలో మర్రి ఇమాన్యుల్ సహకారంతో అదేవిధంగా బిజెపి ఎస్సీ నాయకులు చిలక వీరాస్వామి ఈ ప్రాంతంలో మతమార్పిడిలపై మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి వాటిపై ఎలా మనం మార్పు తీసుకురావాలో తెలియజేస్తున్నారని శ్రీనివాస్ తెలియజేశారు అదేవిధంగా ఈ దళిత కాలనీలో జరిగిన కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ ఏలూరు జిల్లా పెద్దలు గోపాల కృష్ణ మరియు సింహాద్రి భూపతి హిందూ ధర్మ రక్షా సమితి నాయకులు రాజనాల రామచంద్ర రావు స్థానిక హిందూ నాయకులు సుంకవల్లి రాంబాబు  బిజెపి నాయకులు తాండ్ర సందీప్ డొక్కా బజార్ నాగు గంజి జయరాం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వందలాదిగా దళిత మహిళలు భక్తులు అందరూ పాల్గొన్నారు

శ్వేతపత్రం అంటే ? 

అనేక కీలక అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకున పెట్టేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండు చేయడం తరచూ చూస్తుంటాం. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఈ ‘శ్వేతపత్రం’ అన్న మాట ఎక్కువగా వింటూ ఉంటాం.  ఈ నేపథ్యంలో శ్వేతపత్రం అంటే ఏంటి? అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వం శ్వేతపత్రం ఎందుకు విడుదల చేస్తుంది. ఇలాంటి సందేహాలు చాలా మందిలో తలెత్తడం సహజం.

🔹శ్వేతపత్రం (వైట్‌పేపర్‌) అంటే?

    ఇది ప్రభుత్వ విధాన ప్రకటన. ప్రభుత్వం జారీ చేసే అధికారిక పత్రం. ఏదైనా ఒక సంక్లిష్టమైన అంశంపై ప్రభుత్వ వైఖరిని, విధానాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు ఉద్దేశించిన అధికారిక నివేదిక/పత్రాన్ని శ్వేతపత్రం అని పిలుస్తారు.

  👉ఏయే సందర్భాల్లో విడుదల చేస్తారు                     

 👉కొన్ని ప్రభుత్వాలు త్వరలో చేయబోయే చట్టాలకు సంబంధించి తమ ప్రతిపాదనల్ని ప్రజలకు వివరించేందుకు.                                        

👉కొన్ని సందర్భాల్లో ముసాయిదా బిల్లును తెచ్చేందుకు.                                             

 👉అప్పటికే ఉన్న ఒక చట్టంలో సవరణలు చేయాల్సి వచ్చినప్పుడు.వాటిపై ప్రజల్ని ముందే సమాయత్తం చేసేందుకు.                                         

 👉కీలక అంశాలపై ప్రజల నుంచి స్పందన కోరేటప్పుడు.                                              

 👉ఏదైనా ఒక అంశానికి సంబంధించిన వాస్తవాలు, గణాంకాలతో కూడిన సమాచారం వెల్లడికి.

ఏమిటి ప్రయోజనం

 👉వివాదాస్పద అంశాలపై ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకుని, తదనుగుణంగా విధాన నిర్ణయాల్లో ప్రభుత్వం మార్పులు చేయవచ్చు.            

 👉ప్రభుత్వం చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చు.

మూలం ఎక్కడ

👉శ్వేతపత్రం బ్రిటిష్‌ సంప్రదాయం. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం..                         

 👉1922లో బ్రిటన్‌ ప్రధాని "విన్‌స్టన్‌ చర్చిల్‌" తొలి శ్వేతపత్రం విడుదల చేసినట్లు చెబుతారు.              

👉అమెరికాలో వీటిని ‘బ్యాక్‌గ్రౌండ్‌ పేపర్స్‌’గా పిలుస్తారు.

ఆ పేరు ఎలా వచ్చింది                                                     

👉19వ శతాబ్దంలో బ్రిటన్‌ పార్లమెంటుకు సమర్పించే లెజిస్లేటివ్‌ డాక్యుమెంట్స్‌లో అప్రాధాన్యమైనవి, అనధికారిక (ఇన్‌ఫార్మల్‌) అంశాలతో కూడిన పుస్తకానికి తెల్ల రంగు ముఖపత్రం ఉండేది. తర్వాత కాలంలో ‘వైట్‌పేపర్‌’ అన్న పదం దాని నుంచే వచ్చిందని అంటారు.                    

👉 ఇతర పత్రాలూ ఉన్నాయి

👉శ్వేతపత్రాలతోపాటు, హరిత, నీలి పత్రాలూ వాడుకలో ఉన్నాయి.

హరితం

👉ఇవి కూడా ప్రభుత్వం విడుదల చేసేవే. ఇవి ఒక విధంగా సంప్రదిం పుల పత్రాలు. ఏదైనా ఒక అంశంపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవడానికి ముందు దానిపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడా నికి హరిత పత్రాల్ని విడుదల చేస్తాయి. కెనడాలో గ్రీన్ పేపర్ అధికా రిక ప్రభుత్వ పత్రం.

👉బ్రిటన్ లో గ్రీన్ పేపర్స్ అధికారిక సంప్రదింపుల పత్రాలే.

🌹నీలం

👉ఇది పూర్తిగా సాంకే తిక అంశాలకు సంబంధించినది. ఓ సాంకే తిక అంశం లేదా పరికరానికి సంబంధించిన పూర్తి వివరాల్ని తెలియజేసే పత్రాల్ని నీలిపత్రాలు (బ్లూ పేపర్స్) అని పిలుస్తారు. ఈ పదాన్ని మొదట జర్మనీలో ఉపయోగించారు. ఇప్పుడు ప్రపంచమంతా ప్రాచుర్యం పొందుతోంది.

🌹పసుపు

👉ఇంకా అధికారి కంగా ఆమోదం పొందని, ప్రచురణకు సిద్దంగా ఉన్న పరిశో ధనా పత్రాన్ని పసుపు పత్రం (ఎల్లో పేపర్) అంటారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు